ప్రస్తుతం LPG కి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో.. బిట్స్ పిలాని, హైద్రాబాద్ శాస్త్రవేత్తలు శుభ వార్త చెప్పారు.. LPG కి బదులుగా డైమిథైల్ ఈథర్ వినియోగం సాధ్యమని వెల్లడించారు..రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగాధిపతి సౌనక్ రాయ్ నాయకత్వం లో సత్య పాల్ సింగ్,రిటైర్డ్ ప్రొఫెసర్ బి ఎం రెడ్డి తదితరులు కలిసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే ప్లూ గ్యాస్ ను ప్రయోగ శాలలో సృష్టించారు. దీనిని బై ఫంక్షనల్ పదార్థాల సహాయంతో నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ తో కలిపి డైమిథైల్ ఈథర్ గా మార్చే టెక్నాలజీ ను అభివృద్ధి చేశారు.. LPG తో పోలిస్తే DME కాలుష్య కారకాలు తక్కువగా విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి