2, మార్చి 2024, శనివారం

ఇందూర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్

 ద్వారకానగర్లో భువన సమీక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూరు బ్లడ్ బ్యాంకు ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా ఇందూరు పేరుతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మానవసేవే మాధవసేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్నా అని రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చునని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకొని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని అత్యవసర సమయాలలో బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ సేవలు బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఇండోర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు డాక్టర్ శ్రీశైలం డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ రాజేష్ డాక్టర్ జీవన్ రావు డాక్టర్ వినయ్ శ్రీవాణి ధన్పాల్ కార్పొరేటర్స్ బైక్ అండ్ మధు ప్రభాకర్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నార



డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్య నూతన కార్యవర్గం 2024

 


తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాదులో ఏర్పాటు అయింది 

అధ్యక్షునిగా.. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

 కార్యనిర్వాహక అధ్యక్షులుగా ..శ్రీధర్ రావు ,పరమేష్

 ఉపాధ్యక్షులుగా ..నారాయణ గౌడ్, రవీంద్రనాథ్

 ప్రధాన కార్యదర్శిగా ..యాద రామకృష్ణ 

కోశాధికారిగా ..శంకర్ 

కార్యనిర్వాహక కార్యదర్శిగా ..భాస్కర్ రెడ్డి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పూర్వ అధ్యక్షులు ప్రకాష్ గింజల రమణారెడ్డి సుందర్ రాజ్ కార్యదర్శులు హరిస్మరణ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు

జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం

 మహాత్మ జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన బిసి అభ్యర్థులు ఈనెల ఐదు నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి ఒక ప్రకటనలో తెలిపారు