Sunday 6 March 2022

12 న లోక్ అదాలత్

 ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ లు నిర్వహించనున్నారు. తెలంగాణలో లో హైకోర్టు జిల్లా కోర్టులు కింది కోర్టులు సైతం లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట

 రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ కేసులు ,జరిమానా విధింపు లకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకుని పరిష్కారం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా ఆయన తెలిపారు. కోర్టులు విచారణ చేపట్టని కేసులతో పాటు విచారణ పెండింగ్లో ఉన్న కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment