20, ఆగస్టు 2026, గురువారం

ఉచిత శిక్షణ @ఆదిలాబాద్ పోలీస్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 

ఆగస్టు 23న అర్హత పరీక్ష ఉంటుందని ఉచిత శిక్షణ లో పాల్గొన దలచిన వారు క్యూ ఆర్ కోడ్, ఆన్ లైన్ దరఖాస్తు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆగస్టు 23న ఆదిలాబాద్ DTC లో అర్హత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 

పరీక్ష లో ప్రతిభ చూపించిన వారికి ఆగస్టు 24 నుంచి డిటిసి లో నిపుణులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

స్టడీ మెటీరియల్, శిక్షణ.. 

 కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కు అవసరమైన అన్ని అంశాలలో శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఉచిత వసతి,ఉచిత భోజన సదుపాయం తో శిక్షణ అందిస్తామని తెలిపారు. 

పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు 

ఉచిత శిక్షణ @కాకా ఫౌండేషన్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు కాకా వెంకట స్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

చెన్నూరు మున్సిపాలిటీ లోని మహిళా భవన్, మందమర్రి లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న భవనం/ షెడ్డు లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ బుధవారం ప్రారంభించారు. సుమారు 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. 

ఫ్రీ కరెంట్.. కరీంనగర్ గణేశ్ మండపాలకు

 కరీంనగర్ లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ కు బిల్లులు తాము చెల్లించి మండపాలకు" ఉచితంగా కరెంట్ " అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఏడాది దాదాపు రెండు వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తుండగా గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ కుమార్ తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ పదవి బీజేపీ ఆధీనంలో ఉండటంతో బిల్లులను కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు.