హైదరాబాద్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నారు బుధవారం సంస్థ నిర్వాహకులు మేళా ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు జరగనున్న ఎగ్జిబిషన్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగనున్న పూల మొక్కల ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మూడు రూపాయల నుంచి 16 లక్షల వరకు విలువగల అరుదైన మొక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు
No comments:
Post a Comment