Wednesday, 21 February 2024

ఉద్యోగులకు కంపెనీ రాసిచ్చిన మిలియనీర్

 లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో అమెరికాలో ఒక సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు ఆయన పేరు బాబు మూర్.. బాబ్స్ రెడ్ మిల్ పేరిట  ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని యజమాని మిలియనీర్ అయిన మోర్ తన చిరకాల వాంఛను ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇటీవలే 94 ఏళ్ల వయసులో మోర్ మరణించారు. అమెరికాకు చెందిన మోర్ ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసే విక్రయిస్తుంది. సంస్థ ఆనతి కాలంలోనే అభివృద్ధి చెందడానికి ఉద్యోగులే కారణమని మూర్ ఎప్పుడు అభిప్రాయపడేవాడు .అందుకు తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నాడు.

No comments:

Post a Comment