చైనా వెల్ఫేర్ లాటరీ లో ఓ యువ వ్యాపారి దేశంలోనే అత్యధిక బహుమతిని సొంతం చేసుకున్నారు. గుయిజావ్ ప్రావిన్స్ కి చెందిన ఈ చిరు వ్యాపారి లాటరీలో 795 కోట్ల 84 లక్షల రూపాయలు గెలుచుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. ఆయన 133 టికెట్లను కొన్నారని ప్రతిసారి ఒకే గ్రూపునకు చెందిన ఏడు నెంబర్లపై పందెం కాసేవారని ప్రతి టికెట్కు దాదాపు 6 కోట్ల రూపాయల చొప్పున బహుమతి వచ్చిందని తెలిపారు .విజేత వివరాలను సంస్థ బయట పెట్టలేదు .గుర్తుతెలియని ఆ విజేత ఈనెల 7న బహుమతిని స్వీకరించేందుకు వచ్చారని తెలిపింది. విజేత స్పందిస్తూ ఉద్వేగ భరితంగ అయ్యానని నిద్ర పట్టలేదని చెప్పారు. బహుమతులో ఐదో వంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment