సదాశివ నగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్ నందు ఈనెల ఐదు ఆరు తేదీలలో స్టేట్ లెవెల్ వైబ్రేషన్ ప్రోగ్రాం కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక తెలిపారు గురువారం లేఖర్ల సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు రెండు రోజులపాటు నిర్వహించబోయే కల్చరల్ ఫెస్ట్లో 24 కాంపిటీషన్స్ లోని వివిధ రకాల సాంస్కృతిక పోటీలలో ఉండే నియమ నిబంధనల గురించి వివరించారు ఈ రకమైన పోటీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీలతోపాటు కామారెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని అన్నారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర రాధిక అధ్యాపకులు, విద్యార్థినిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
No comments:
Post a Comment