Friday, 23 February 2024

ఆధ్యాత్మిక సమాచారం ఫిబ్రవరి 23 2024

 ఆలయ అభివృద్ధికి 51 వేల రూపాయల విరాళం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు ఆంజనేయ స్వామి ఆలయాభివృద్ధికి దాత శ్రీనివాస్ 51 వేల రూపాయల విరాళం అందజేశారు ఎల్లారెడ్డిపేటకు చెందిన గురువారం కామారెడ్డి వచ్చి నగదు ఇచ్చి రసీదు పొందారు నాయకులు గరిగంటి లక్ష్మీనారాయణ హనుమాన్ల సురేష్ తదితరులు ఉన్నారు

నవదుర్గ వ్రతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శారదా మాత ఆలయ ఆవరణలో 24వ తేదీన నవదుర్గ వ్రతం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం 11 గంటలకు సామూహికవతాలు ప్రారంభిస్తామన్నారు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామని పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు నెమలిలోని సాయిబాబా ఆలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కాలినడకన తరలివచ్చి అర్చనలోభిషేకాలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు విశ్వకర్మ జయంతి బీర్కూర్ కోదండ రామాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేశారు శశికాంత్ బసవరాజు రమేష్ పండరీ ప్రకాష్ గంగాధర్ పాల్గొన్నారు నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు లింగంపల్లి వాడి చినూరు ఆత్మకూరు గ్రామాలకు చెందిన 30 మంది రామభక్తులు భాజపా మండల అధ్యక్షుడు హనుమాన్లు ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు తరలి వెళ్లారు పుష్యమి నక్షత్ర పూజలు మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిరంలో గురువారం పుష్యతి నక్షత్రం పురస్కరించుకొని యోగ ప్రముఖ లావణ్య మాతాజీ ఆధ్వర్యంలో హోమం పూజలు నిర్వహించారు అనంతరం 135 మంది చిన్నారులకు సువర్ణప్రాసన ఔషధం వేశారు కార్యక్రమంలో కన్వీనర్ గ్రామం సంచాలన సమితి ఉపాధ్యక్షుడు కోటరాజులు సువర్ణప్రాసన ప్రముఖ గీత పాఠశాల ప్రధానాచార్యులు బద్రి పోషకులు ఆచార్యులు మాతాజీలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment