Wednesday, 6 March 2024

యూఎస్ సదస్సుకు తెలంగాణ యువతి ఎంపిక

 రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ చందన యూఎస్ జ్యుడీషియల్ విధానం అనే అంశంపై అమెరికాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు మొత్తం 22 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున తెలంగాణ నుంచి చెందిన ఎంపిక కావడం విశేషం చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వుమన్ రైట్స్ అనే అంశంపై ఆమె పోరాటాన్ని గుర్తించిన యుఎస్ ప్రతినిధులు చందనను ఆహ్వానించారు ప్రస్తుతం బచావో ఆందోళన్ లో స్టేట్ కోఆర్డినేటర్ గా ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. చిన్న పిల్లలు మహిళల కోసం యూఎస్ న్యాయవ్యవస్థలో ఉన్న అంశాలతో పాటు వివిధ దేశాల్లోని న్యాయవ్యవస్థలోను ఏ విధంగా ఉన్నాయన్న అంశాల పైన ప్రతినిధులకు నిర్వహించే పలు కార్యక్రమాల్లో తాను పాల్గొని చర్చించనున్నట్లు చందన తెలిపారు అమెరికాలో ఏప్రిల్ 6 నుంచి 27 వరకు జరిగే ఆయా కార్యక్రమాల్లో తాను పాల్గొంటారని తెలిపారు

No comments:

Post a Comment