ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం రూట్ లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడం పై ఉన్నతాధికారుల ఆగ్రహం
ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్ నడపడం వివాదాస్పదమైంది ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు కాలేజీ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈరోట్లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం ప్రతి ఉంటున్నది ఫుట్ బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు. ఈ రద్దీని తగ్గించేందుకు అధికారులు జెంట్స్ స్పెషల్ బస్సు నడిపారు అయితే దీనిపై మహిళలు అభ్యంతరం చెప్పడంతో ఒక్క ట్రిప్ నడిపిన తర్వాత బస్సును ఆపేశారు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను వివరణ కోరగా జెంట్స్ స్పెషల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు అలాంటి బస్సులు నడపాలని ఆదేశాలు ఇవి లేవన్నారు అనుమతి తీసుకోకుండానే బస్సు ఎలా నడుపుతారని డిపో మేనేజర్ పై ఆ గ్రహం వ్యక్తం చేశారు దీంతో అది పాత ఫోటో అని జెంట్స్ స్పెషల్ బస్సు నడపలేదని డిపో అధికారులు మాట మార్చారు హైదరాబాదులో మహిళలు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని రూట్లలో ఇప్పటికే లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు వీటి సంఖ్య పెంచాలని ప్రపోజల్ వస్తున్న బస్సుల కొరత కారణంగా ఆర్టీసీ పెంచడం లేదు త్వరలో కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో వీటి సంఖ్య పెంచాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది
No comments:
Post a Comment