Friday, 23 February 2024

కిడ్నీ రోగులకు వరంగా పెయిర్డ్ కిడ్నీ డొనేషన్

 


దేశంలోనే సరికొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ రూపకల్పన అదనంగా 40 శాతం మంది రోగులకు ప్రయోజనం వెబ్సైట్ను ఆవిష్కరించిన స్టార్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ గోపీచంద్ మన్యం

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కుటుంబంలోని దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 3 నుంచి 5% మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలను ఏకంగా 40 శాతం వరకు తీసుకువెళ్లేందుకు కిడ్నీ డొనేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని స్టార్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నెం చెప్పారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని స్టార్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్దాన్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ స్వర్ణలత స్టార్ ఆసుపత్రి నేఫరాలజీ నిభాగాధిపతి డాక్టర్ గంధ శ్రీధర్ తో కలిసి కిడ్నీ స్టాప్ ట్రాన్స్ ప్లాంట్స్ విధానంలో భాగంగా దాతలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ కేడీ విధానం కిడ్నీ రోగులకు వరప్రదాయని అని అభివర్ణించారు భారత్ లో ఏటా సుమారు రెండు లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం అవుతుండగా కేవలం ఎనిమిది నుంచి పదివేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి అవకాశం లభిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడిన బ్లడ్ గ్రూపులు కలపకపోవడంతో మార్పిడి చేయడం సాధ్యం కావడం లేదని చెప్పారు దీంతో ఎన్నో ఏళ్లపాటు డయాలసిస్ మీదనే వారు జీవితాన్ని గడపాల్సి వస్తుందని తెలిపారు దీనికి తోడు మధుమేహం పోషకాల కొరత అతి తక్కువ శానిటేషన్ వంటి కారణాలతో రోగం కాస్త క్రోనిక కిడ్నీ డిసీస్ గా మారుతున్నదని దేశంలో దాదాపు 17 శాతం మందిని సి కె డి వేధిస్తున్నదని వెల్లడించారు గోపీచంద్ తెలిపారు. ఇది తీవ్రతరమై చివరకు అంత్యదశ మూత్రపిండాల వ్యాధి కి దారితీస్తున్నదని అన్నారు కిడ్నీ రోగుల ప్రాణాలను కాపాడేందుకు పేయిర్డ్ కిడ్నీ డొనేషన్ అని అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ గోపీచంద్ తెలిపారు కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వేరువేరు కుటుంబాల్లోని దాతలతో కలుసుకొని తమ వారికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు ఈ విధానం దేశంలో మూత్రపిండాల మార్పిడిలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని గోపీచంద్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా జీవన్ధాని ఇంచార్జి డాక్టర్ స్వర్ణలతో మాట్లాడుతూ అవయవదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ప్రస్తుతం అవయవదానంపై ప్రజల్లో కొంత మార్పు వచ్చిందన్నారు స్టార్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన పీకేడి విధానంతో అందలాదిమందికి కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రెండు నెలల కిందట టీకేడీ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకున్న రఘునాథరెడ్డి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు

No comments:

Post a Comment