Thursday, 1 February 2024

వాలీబాల్ విజేత మగ్గిడి జట్టు

 ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఉపకాల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో అండర్ 17 జిల్లా స్థాయిలో బాలబాలికలకు ఒకరోజు వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు వాలీబాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ మగిడి జట్టు బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో కలిగోట్ జడ్పీహెచ్ఎస్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ పోచంపాడు ప్రథమ ద్వితీయ స్థానం కాకతీయ ఉన్నత పాఠశాల నిజామాబాద్ జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా బాలురకు కబడ్డీ పోటీలు సైతం చేపట్టారు ఇందల్వాయి జట్టు ప్రథమ బాల్కొండ కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపొందిన జట్లకు ప్రథమ జట్టుకు పదివేల రూపాయలు ద్వితీయ జట్టుకు 5000 రూపాయలతో పాటు షీల్డ్లను అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు భూమేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి బద్దం నరసారెడ్డి మోత గంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ టి సాయన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య పుష్ప నాథ్ గోపీనాథ్ జిల్లా కమిటీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే గంగాధర్ పిడి రాజకుమార్ మల్లేష్ గౌడ్ పీఈటీలు పాల్గొన్నారు



No comments:

Post a Comment