వంద కేసులు దాటితే పోక్సో కోర్టు

 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక జిల్లా పరిధిలో పోక్సో కేసులు 100 దాటితే ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపనున్నట్లు జస్టిస్ లక్ష్మణ్ గారు తెలిపారు.




స్క్రబ్బర్ లు, స్పాంజ్ ల శుభ్రత

 వేడి నీళ్లలో కాస్తంత వెనిగర్ వేసి పాత్రలు తోమే స్క్రబ్బర్లు,స్పాంజ్ లను రాత్రంతా నానబెట్టిన చో మురికి పోయి,సూక్ష్మ జీవులు చనిపోయి శుభ్రము అవుతవి.




Sunday, 6 March 2022

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రీయ సంస్కృత ఉత్సవాలు

 ఈ ఏడాది ఇది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు హైదరాబాద్ లో రాష్ట్రీయ సంస్కృతి  ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు తెలిపారు.




శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

దోమకొండ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 5 6 7 తేదీలలో శ్రీ మల్లికార్జున స్వామి  కల్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ ,
యాదవ సంఘం, దోమకొండ.






 

మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కంటి దవాఖనాల నెట్వర్క్ Dr అగర్వాల్ ఐ

హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ అ దవాఖానాల్లో మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల కొరకు 9619334129 నంబర్ పై సంప్రదించాలని సూచించారు.



12 న లోక్ అదాలత్

 ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ లు నిర్వహించనున్నారు. తెలంగాణలో లో హైకోర్టు జిల్లా కోర్టులు కింది కోర్టులు సైతం లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట

 రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ కేసులు ,జరిమానా విధింపు లకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకుని పరిష్కారం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా ఆయన తెలిపారు. కోర్టులు విచారణ చేపట్టని కేసులతో పాటు విచారణ పెండింగ్లో ఉన్న కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.


నోటి దగ్గర పిగ్మెంటేషన్

 కొందరికి నోటి క్రింద, పక్కల పిగ్మెంటేషన్ కనిపిస్తుంటుంది. చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి ,ముల్తానీ మట్టి ,పాలు, అరచెంచా తేనె తీసుకుని అన్నింటినీ కలిపి మిశ్రమంలా చేయాలి. దానిని నలుపుగా ఉన్న చోట రాసి పావుగంట తర్వాత కడిగివయాలి.